సృష్టి ఆరంభంనుంచి చేతివృత్తుల వారే మొదటితరం ఇంజినీర్లుగా ప్రసిద్ధిచెందారు , సమాజ నాగరికత కు ,అభివృద్ధికి చేతివృత్తులే ఆధారం పనిలో ఖచ్చితత్వం , నైపుణ్యం వల్ల ఆదరణ , గౌరవం సమాజంలో ఉండేవి. కాలక్రమేణా చేతివృత్తులలోకి కార్పొరేట్ సంస్థల ఆగమనం వల్ల చాలా వృత్తులు కనుమరుగు అయిపోయాయి. నేటిసమాజంలో వేగవంతమే ప్రామాణికం అవుతున్న వేళలో కాస్తో కూస్తో ఆదరణ ఉన్న వృత్తులలో కార్పెంటర్(వగ్రంగి,కలప పని)ఒకటి. అంతేకాకుండా పురాతన వృత్తులలో ఒకటి , ఇంటి తలుపులు, కిటికీలు, డైనింగ్ టేబుల్లు, మంచాలు, వడ్రంగులు చేస్తారు. ప్రస్తుతం వడ్రంగితో పనిచేయించుకుంటే ఆలస్యం అవుతుందని భావించి రెడీమెడ్ తలుపులు, డైనింగ్ టేబుళ్ళను కొనుగోలు చేయడంతో ఈ రకం చేతి వృత్తులు అంతరించి పోతున్నాయి. అనేక జిల్లాలలో వేలాది ముస్లింలు , ఇతర మతస్థులు కూడా వడ్రంగిపని చేస్తున్నారు. నెల పొడవునా పనిచేసినా కనీసం వెయ్యిరూపాయలు కూడా రాదని వడ్రంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . కులవృత్తినే నమ్ముకుని వేలాది మంది తమ గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వచ్చారు. చేసే పనికి కూలీ గిట్టుబాటు కాక నేడు వారు నౌకర్లుగా, గుమస్తాలుగా వేరే పనుల్లో పడుతున్నారు. అతి సాధారణ పనిముట్లతో ఎంతో అద్భుత సృష్టి చేసిన వడ్రంగి వృత్తివారు వాడే సాధారణ పనిముట్లు - చిత్రిక
- సుత్తి
- ఉలి
- బాడిత
- రంపం
ఒకపక్క కార్పొరేట్ సంస్థల పోటీని , ప్రభుత్వాలనుంచి ఆదరణ లేకున్నా మనమందరం సమిష్టి కృషితో కనుమరుగు కాకుండా కాపాడుకుంటూ వస్తున్నాము. కానీ మన తర్వాతి తరం ఈ వృత్తిలో కొనసాగడానికి ఎవ్వరు ముందుకు రావడంలేదు అందుకే ప్రభుత్వాలు మనవృత్తిని గుర్తించి ప్రోత్సహించేలా పోరాటాలు చేయాల్సిన అగత్యం వస్తుంది అందుకు బలమైన వేదిక ఒకటి అవసరం. అందుకు రాష్ట్రవ్యాప్త వేదిక , ఐక్యమత్యం ఎంతైనా అవసరం అలాంటి వేదిక బలమైన సంఘం , సమర్ధనాయకత్వo ద్వారానే సాధ్యం.అందుకే ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ ర్తాష్ట్రవ్యాప్త కార్పెంటర్స్ భాగస్వామ్యంతో అనంతపురం వేదికగా ఒకటి స్థాపించబడినది.
No comments:
Post a Comment